ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ బలోపేతం కావడానికి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర పార్టీ నాయకులకు దిశానిర్ధేశం చేశారు. రాష్ట్రంలో అధికారమలో ఉన్న వైసిపి ప్రభుత్వం అక్రమాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం జరపాలని స్పష్టం చేశారు. వైసిపి, టిడిపిలకు సమదూరం పాటిస్తూ, సొంతంగా పార్టీని అభివృద్ధి చేసుకోవడం పట్ల దృష్టి సారించాలని హితవు చెప్పారు.